మే రెండో వారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని సోషల్ మీడియాలో ఓ వ్యక్తి తెలియజేశారు. ఆయన వాతావరణ శాఖ అధికారి కాదు.. సినీ దర్శకుడు మారుతి! ఇంకా ఖచ్చితంగా చెప్పుకోవాలంటే ‘రాజాసాబ్’ దర్శకుడు.
ఈ నెల 10న రాజాసాబ్ విడుదల కావలసి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఇప్పుడు దర్శకుడు మారుతి మే రెండో వారం నుంచి వేసవి ఉష్ణోగ్రతలు మరింత పెరుగబోతున్నాయంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం చూస్తే మే రెండో వారం నుంచి రాజాసాబ్ ప్రమోషన్స్ మొదలుపెట్టి జూన్ లేదా జూలై నెలలో విడుదల చేస్తామని చెపుతున్నట్లు భావించవచ్చు.
దర్శకుడు మారుతి ఈ సందేశంతో పాటు ఓ ఆసక్తికరమైన ఫోటో కూడా పెట్టారు. ఓ ఆటో రిక్షా వెనుక ప్రభాస్ ఫోటో దాని కింద ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయబడిన ఓ కొటేషన్ ఉంది. ‘నవ్ ఏ డేస్’ ప్రజలకు ప్రతీ దాని ధర తెలుసు కానీ దేని విలువ తెలియదు,” అని వ్రాయబడింది. అంటే ప్రభాస్ విలువ ఎవరూ గుర్తించ లేకపోతున్నారు ఆయన చాలా అమూల్యమైన వ్యక్తి అని మారుతి చెపుతున్నట్లు అనుకోవాలేమో? లేదా ప్రభాస్తో రాజాసాబ్ సినిమా చేస్తున్నందున ప్రభాస్ ఫొటోతో ఆలోచింపజేసే ఆ కొటేషన్ నచ్చి అభిమానులతో షేర్ చేసుకుని ఉండొచ్చు.
ఈ సినిమాలో ప్రభాస్కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు.
రాజాసాబ్ సినిమాకు సంగీతం: ఎస్ఎస్ తమన్, కెమెరా: కార్తీక్ పళని, ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వ ప్రసాద్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.
HIGH ALERT…‼️
HEAT WAVES gonna rise even higher from mid May! 🔥🔥🔥 pic.twitter.com/EdEdtMCq6E