రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబీ29 వర్కింగ్ టైటిల్తో తీస్తున్న సినిమాలో ఇప్పటికే ఒడిశాలో మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. త్వరలో రెండో షెడ్యూల్ హైదరాబాద్లో మొదలవబోతోంది.
దీనిలో సుమారు 3,000 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ దర్శకత్వంలో ఈ భారీ యాక్షన్ సీన్స్ షూటింగ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీని కోసం హైదరాబాద్లో భారీ సెట్స్ వేస్తున్నారు.
ఈ షెడ్యూల్లో మహేష్ బాబు, ప్రియాంకా చోప్రా, పృధ్వీరాజ్ సుకుమారన్ ముగ్గురూ కూడా పాల్గొనబోతున్నారు. నీళ్ళలో స్పీడ్ బోట్స్ యాక్షన్ సీన్స్ చేయడం కోసం ముగ్గురికీ ప్రత్యేక శిక్షణ ఇవ్వబోతున్నారట.
ఈ సినిమాకు సంగీతం: కీరవాణి, డైలాగ్స్: దేవా కట్ట అందిస్తున్నారు. సుమారు వెయ్యి కోట్ల భారీ బడ్జెట్తో అంతర్జాతీయ స్థాయిలో కె ఎల్ నారాయణ ఈ సినిమా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు కూడా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కధ అందించారు. హీరో బృందం అనేక దేశాలలో, దట్టమైన అడవులలో ప్రయాణిస్తూ చేసే సాహసయాత్ర, పోరాటాలతో ఈ కధని రూపొందించారు. ఈ సినిమా టైటిల్ ప్రకటించేందుకు ఇంకా చాలా సమయం పట్టవచ్చు.