జూ.ఎన్టీఆర్ దేవర సినిమా తర్వాత ప్రశాంత్ నీల్తో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. దేవర నుంచి జూ.ఎన్టీఆర్ బయటకు వచ్చి చాలా రోజులే అయ్యింది. అది పూర్తికాగానే బాలీవుడ్లో హృతిక రోషన్తో కలిసి వార్-2 సినిమా చేశారు. కనుక ఇప్పుడు ఎన్టీఆర్-నీల్ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా? అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వారికి ఓ శుభవార్త!
ఇటీవలే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తవడంతో ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. అయితే మార్చి నెలాఖరున లేదా ఏప్రిల్ నెలలో జూ.ఎన్టీఆర్ షూటింగ్లో జాయిన్ అవుతారని తెలుస్తోంది.
ఈ సినిమాలో జూ.ఎన్టీఆర్కి జోడీగా కన్నడ భామ రుక్మిణీ వసంత్ నటించబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి పాన్ ఇండియా మూవీగా దీనిని తెరకెక్కించబోతున్నాయి. ఈ సినిమాని 2026 జనవరిలో విడుదల చేస్తామని ప్రశాంత్ నీల్ చెప్పారు. కనుక ఈ పది నెలల్లో సినిమాని పూర్తిచేసేందుకు ప్రశాంత్ నీల్ అంతా ప్లాన్ చేసుకుని షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు.