సుధీర్ వర్మ నిఖిల్ కాంబినేషన్లో స్వామి రారా, కేశవ రెండు సినిమాలు చేశారు. ఇప్పుడు వారిద్దరూ కలిసి మూడో సినిమా చేస్తున్నారు. బొమ్మరిల్లు సినిమాలోని ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో…’ అనే పాట చరణంలో మొదటి మూడు పదాలను ఈ సినిమాకి టైటిల్గా ఖరారు చేశారు.
ఈ సినిమాతో కన్నడ నటి రుక్మిణీ వసంత్ టాలీవుడ్లో హీరోయిన్గా అడుగుపెడుతోంది. హీరో హీరోయిన్లు హాయిగా కబుర్లు చెప్పుకొంటూ నడుస్తున్న ఫోటోతో ఫస్ట్-లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ దీపావళికి సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు పోస్టర్లోనే చెప్పేశారు.
ఈ సినిమాలో దివ్యాంషు కౌశిక్, హర్ష చేముదు తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకి సన్నీ ఎంఆర్ సంగీతం అందిస్తుండగా, నేపద్య గాయకుడు కార్తీక్ పాటలకు సంగీతం అందిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.