జాన్వీ కపూర్‌ బాయ్ ఫ్రెండ్ ముచ్చట్లు

July 21, 2024


img

అలనాటి అందాల నటి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ నటించిన తాజా హిందీ చిత్రం ‘ఉలజ్’ ఆగస్ట్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహాడియాతో రిలేషన్‌లో ఉన్నానని స్పష్టం చేసింది. 

అయితే అతనికి అనేకసార్లు బ్రేకప్ చెప్పానని, తన వలన అతను చాలా ఇబ్బంది పడ్డాడని చెప్పారు. తనకు పీరియడ్స్ సమయంలో చాలా చిరాకు, కోపం, ఆవేశం కలుగుతుంటాయని జాన్వీ కపూర్‌ చెప్పారు. ఆ సమయంలో పని ఒత్తిడి కూడా ఉండటంతో అతనిపై తన కోపం, చిరాకు ప్రదర్శిస్తూ ఆవేశంతో బ్రేకప్ చెప్పేసేదానినని చెప్పారు. 

అయితే ఆ ఒత్తిడి నుంచి తేరుకున్నాక మళ్ళీ అతని వద్దకు వెళ్ళి తన పరిస్థితి వివరించి సారీ చెప్పేదానినని అన్నారు. మొదటిసారి చిన్న కారణంతో నేను అతనికి బ్రేకప్ చెప్పినప్పుడు, అతను షాక్ అయ్యాడని కానీ ఆ తర్వాత నా పరిస్థితిని వివరించినప్పటి నుంచి ఆ సమయంలో నేను ఏమన్నా పట్టించుకునేవాడు కాడని జాన్వీ కపూర్‌ చెప్పారు. 

ఆవిదంగా అతనికి తాను చాలాసార్లు బ్రేకప్ చెప్పానని, అయినా అతను చాలా ఓపికగా నా కోపం, చిరాకులని భరించేవాడని జాన్వీ కపూర్‌ నవ్వుతూ చెప్పారు. అతని సహనం, మంచితనం చూసిన తర్వాత ఇప్పుడు ఎంత చిరాకుగా ఉన్నా బ్రేకప్ చెప్పడం మానేశానని చెప్పారు. తన ఇష్టదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి అని తాము ఎప్పుడైనా అక్కడే పెళ్ళి చేసుకుంటామని జాన్వీ కపూర్‌ చెప్పారు. 

తన ఉలజ్ సినిమా దేశభక్తి పూరితమైనది… మంచి యాక్షన్ సినిమా కూడా కనుక ఆ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నానని జాన్వీ కపూర్‌ అన్నారు.  

జాన్వీ కపూర్‌ ప్రస్తుతం జూ.ఎన్టీఆర్‌తో దేవర సినిమాలో నటిస్తున్నారు. దాని తర్వాత రామ్ చరణ్‌-బుచ్చిబాబు సినిమాలో, దాని తర్వాత నానికి హీరోయిన్‌గా మరో సినిమాలో నటించబోతున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష