ప్రభాస్, శ్రుతీ హాసన్ జంటగా వస్తున్న సలార్ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. తెలంగాణలో ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అనుబంద సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్స్ ఎల్ఎల్పీ దక్కించుకొంది. సలార్ టీమ్ ఈ విషయం ట్విట్టర్లో ప్రకటించింది. ఆంధ్రాలో ఆరుగురు డిస్ట్రిబ్యూటర్లకు సలార్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ లభించగా, తెలంగాణ యావత్తు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకే లభించడం విశేషం.
ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో సలార్ డిస్ట్రిబ్యూటర్లని ఖరారు చేసుకొని ముందుకు సాగుతోంది. డిసెంబర్ 1వ తేదీన సాయంత్రం 7.19 గంటలకు సలార్ ట్రైలర్ విడుదల కాబోతోంది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో జగపతిబాబు, ఈశ్వరీ రావు, శ్రీయరెడ్డి, పృధ్వీరాజ్ సుకుమారన్, టీను ఆనంద్, రామచంద్రరాజు, సప్తగిరి, బ్రహ్మాజీ, పృధ్వీరాజ్, ఝాన్సీ, మధు గురుస్వామి, నాగ మహేశ్, దుబ్బాక భాస్కరరావు, జెమిని సురేశ్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు సంగీతం: రవి బస్రూర్, కెమెరా: భువన్ గౌడ, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు.
రూ.200-250 కోట్ల భారీ బడ్జెట్తో హోంభోలే ఫిలిమ్స్ బ్యానర్పై విజయ్ దేవరకొండ కిరగందూర్ పాన్ ఇండియా మూవీగా సలార్ నిర్మిస్తున్నారు.