మహేష్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబీ28 వర్కింగ్ టైటిల్తో సిద్దమవుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మే 31న ఈ సినిమా టైటిల్ ప్రకటించనున్నట్లు ఈ సినిమాను నిర్మిస్తున్న హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఆదేరోజు థియేటర్లలో కూడా ఈ సినిమా టైటిల్ పోస్టర్ విడుదల కాబోతోంది.
ఈ సినిమాలో మహేష్ బాబుకు హీరోయిన్లుగా పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. కన్నడ నటుడు రవిచంద్రన్ మహేష్ బాబుకి తండ్రిగా నటిస్తున్నారు.
ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం ఎస్.తమన్, కెమెరా: పిఎస్ వినోద్, ఎడిటింగ్ నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టరుగా ఏఎస్ ప్రకాష్ పనిచేస్తున్నారు.