పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో సినిమాకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30న హైదరాబాద్ ఈ సినిమాకి పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ఆ సంస్థ అధినేత డీవీవీ దానయ్య ఈ సినిమాని నిర్మించబోతున్నారు. ఇదివరకు డీవీవీ-పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా తీయగా అది పెద్దగా ఆడలేదు.
పవన్ కళ్యాణ్ కోసం సుజీత్ గ్యాంగ్స్టర్ నేపధ్యంతో వ్రాసుకొన్న కధతో ఈ సినిమాని తీయబోతున్నారు. గత నెల డిసెంబర్ 4వ తేదీన ఈ సినిమాని ప్రకటించినప్పుడు పోస్టర్ను మీద పవన్ కళ్యాణ్ నీడని తుపాకీలాగ చూపుతూ ‘అందరూ ఆయనని ఓజీ అంటారు’ అని క్యాప్షన్ వేశారు. ఓజీ అంటే అందరూ ‘ఓహ్ మై గాడ్’ అనుకొంటారు కానీ ఓజీ అంటే ‘ఒరిజినల్ గ్యాంగ్స్టర్’ అని అర్దమట! ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్లకే గ్యాంగ్స్టర్గా చేయబోతున్నారు.
పూజా కార్యక్రమంలో సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి మొదలుపెడతారో తెలిసే అవకాశం ఉంతుంది. ఈ సినిమాలో నటించబోయే నటీనటులు, టెక్నీషియన్స్ పేర్లుకూడా త్వరలోనే ప్రకటించనున్నారు.