వెంకటేష్-శైలేష్ కొలను కాంబినేషన్లో తెరకెక్కించబోతున్న సైంధవ్ సినిమాకి ఈరోజు హైదరాబాద్లో పూజా కార్యక్రమం చేశారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు ముహూర్తం షాట్కి క్లాప్ కొత్తగా నిర్మాత దిల్దిల్రాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి ముహూర్తం షాట్కి దర్శకత్వం చేశారు. ఈ కార్యక్రమంలో సురేష్ బాబు, దగ్గుబాటి రానా, నాగ చైతన్య నవాజుద్దీన్ సిద్దీఖీ, వెంకట్ బోయినపల్లి, నాని తదితరులు హాజరయ్యారు.
ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించబోతున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై వెంకటేష్ బోయినపల్లి ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ నిర్మించబోతున్నారు. వెంకటేష్ కెరీర్లో ఇది 75వ చిత్రం. త్వరలోనే ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటిస్తామని దర్శకుడు శైలేష్ కొలను తెలిపారు.