తెలుగు సినీ నిర్మాతల మండలి ఈరోజు హైదరాబాద్లోని ఫిలిమ్ ఛాంబర్లో సమావేశమయ్యి కీలక నిర్ణయాలు తీసుకొంది.
• ఇక నుంచి భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్లలో విడుదలైన 10 వారాల తరువాతే ఓటీటీలలో విడుదల చేయాలి.
• రూ.6 కోట్ల లోపు బడ్జెట్ సినిమాలను ఎన్ని వారాల తరువాత ఓటీటీలో విడుదల చేయాలనే దానిపై ఫిలిమ్ ఫెడరేషన్తో చర్చించిన తరువాత తుది నిర్ణయం తీసుకోబడుతుంది.
• అంతకంటే చిన్న బడ్జెట్ సినిమాలు 4 వారాల తరువాత ఓటీటీలలో విడుదల చేసుకోవచ్చు.
• సినిమాల ప్రదర్శనకు వర్చువల్ ప్రింట్ ఫీజు అంటే పోస్టర్లు, ఫ్లెక్సీ బ్యానర్లు వగైరాల ఖర్చును ఎగ్జిబిటర్లే భరిచాల్సి ఉంటుంది.
• నగరాలు, పట్టణాలలో సాధారణ థియేటర్లు, సీ-క్లాస్ సెంటర్లలో టికెట్ ధరలు జీఎస్టీతో కలిపి రూ.100, రూ.70 మాత్రమే వసూలు చేయాలి. మల్టీప్లెక్స్ థియేటర్లలో జీఎస్టీతో కలిపి రూ.125 మాత్రమే వసూలు చేయాలి.
• మీడియం బడ్జెట్, మీడియం లెవెల్ హీరోల సినిమాలకు నగరాలు, పట్టణాలలో సాధారణ థియేటర్లలో టికెట్ ధరలు రూ.100+జీఎస్టీ, సీ-క్లాస్ సెంటర్లలో జీఎస్టీతో కలిపి రూ.100 మాత్రమే వసూలు చేయాలి. మల్టీప్లెక్స్ థియేటర్లలో గరిష్టంగా రూ.150+ జీఎస్టీ మాత్రమే వసూలు చేయాలి.
• నిర్మాతలను తప్పుదోవ పట్టిస్తున్న కారణంగా ఇండస్ట్రీలో మేనేజర్లు, కో-ఆర్డినేటర్ల వ్యవస్థ రద్దుకు నిర్మాతల మండలి సిఫార్సు చేసింది.
• ఇకపై నటీనటుల సహాయకులకు వసతి, ఇతర సౌకర్యాలు కల్పించబడదు. నటీనటులు తమకు లభించిన పారితోషికం నుచే సహాయకుల ఖర్చులు భరించాల్సి ఉంటుంది.
• సినీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై మరోసారి సమావేశమయ్యి చర్చించి నిర్ణయాలు తీసుకోబడతాయి.