పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారువారి పాట మే 12న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మహేష్ బాబు తన అభిమానులకు ఆ సినిమా గురించి వివరిస్తూ తప్పక ఆ సినిమా చూసి మీ స్పందన తెలియజేయాలని కోరుతూ ఓ లేఖ వ్రాశారు. తాను తరువాత చేయబోయే సినిమా గురించి కూడా దానిలో క్లుప్తంగా పేర్కొన్నారు.
తమ అభిమాన హీరో నుంచి వచ్చిన ఈ లేఖను చూసి మహేష్ బాబు అభిమానులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు ఆ లేఖను తెలుగులోనే వ్రాశారు కనుక దానిలో ఆయన ఏమి వ్రాశారో మీరే స్వయంగా చదవండి. మహేష్ బాబు సంతకంతో ఈరోజు విడుదలైన ఆ లేఖ ఇదిగో...