ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున ‘ద ఘోస్ట్’ అనే ఓ సినిమా చేస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నాగ్ రీసర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) ఏజంట్గా చేస్తున్నారు.
ఈ సినిమాలో నాగ్కు జోడీగా మొదట కాజల్ అగర్వాల్ను అనుకొన్నారు. కానీ ఆమె వ్యక్తిగత కారణాలతో ఈ సినిమా చేయలేనని చెప్పడంతో నిర్మాతలు అమలా పౌల్ను సంప్రదించారు. ఆమె భారీగా పారితోషికం అడగడంతో నిర్మాతలు మెహ్రీన్ ఫిర్జాదాను ఖాయం చేసుకొన్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను శరత్ మరార్, పి.రామ్మోహన్ రావు, నారాయణదాస్ సారంగ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకొంది. తరువాత షెడ్యూ ల్స్లో హీరోయిన్తో సన్నివేశాలు షూట్ చేయవలసి ఉంది కనుక నిర్మాతలు మెహ్రీన్ ఫిర్జాదాను ఖరారు చేసుకొన్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు కెమెరా: ముఖేష్, సంగీత దర్శకత్వం: భరత్-సురభ్, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల.
నాగ్ ప్రస్తుతం బంగార్రాజు చేస్తుండగా, మెహ్రీన్ విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజాలతో కలిసి ఎఫ్-3, శివ రాజ్కుమార్తో ఓ కన్నడ సినిమా చేస్తోంది.