నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా నటించిన అఖండ డిసెంబర్ 2వ తేదీన విడుదలవుతోంది. కనుక సినీ దర్శకనిర్మాతలు శనివారం సాయంత్రం హైదరాబాద్ నగరంలో శిల్పకళావేదికలో అఖండ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా డైరెక్టర్ రాజమౌళి రాబోతున్నారు. బాలకృష్ణ, ప్రగ్యాస్వాల్, సినిమా బృందంతోపాటు టాలీవుడ్కి చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
ఈ సినిమాలో జగపతిబాబు, సుబ్బరాజు, పి.సాయికుమార్, ప్రభాకర్, శ్రవణ్, శ్రీకాంత్, అవినాష్, షమ్నా ఖాసీం ముఖ్య పాత్రలు చేశారు.
బోయపాటి శీను దర్శకత్వంలో రూపొందిన అఖండను ద్వారకా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. అఖండకు ఎస్ఎస్ ధమన్ సంగీతం సమకూర్చారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు రూ.19 కోట్లకు నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులు పొందారు. ఆంధ్రా, తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి డిస్ట్రిబ్యూషన్ హక్కుల ద్వారా మొత్తం రూ.51 కోట్లు వసూలు అయినట్లు తెలుస్తోంది. ఇదిగాక డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ద్వారా మరికొంత వసూలు అయ్యింది. థియేటర్లలో విడుదలైన కొన్ని వారాల తరువాత అఖండ డిస్నీ+హాట్ స్టార్లో విడుదలవుతుంది.
ఈ సినిమా పూర్తయినందున బాలకృష్ణ తన తదుపరి సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రారంభించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మించబోతున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటించబోతోంది.