మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు పోటీగా మంచు విష్ణు ప్యానెల్ రెడీ అవుతుంది. ఈమధ్యనే మంచు విష్ణు తన ప్యానెల్ సభ్యులను ఎనౌన్స్ చేశాడు. ఇక లేటెస్ట్ గా మా బిల్డింగ్ ఒక్కటి కడితే ఆర్టిస్ట్ సమస్యలు తీరవని.. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయని అన్నారు మంచు విష్ణు. అవతల ప్యానెల్ లో తమ సినిమాల్లో చేసిన వారు ఉన్నారని.. ఇది కేవలం ఎన్నికల పోటీ మాత్రమే అని అన్నారు. రెస్టారెంట్ లో కూపన్ల గురించి ప్రస్థావించిన మంచు విష్ణు ఆర్టిస్టులకు అవి అవసరం లేదని అన్నారు.
ఇళయరాజాతో స్పెషల్ ఈవెంట్ కు 3 కోట్లు అడిగారని ప్రకాష్ రాజ్ ఈమధ్య మీటింగ్ లో చెప్పగా.. ఇళయరాజాతో తాను ఫ్రీగా ఈవెంట్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. మొత్తానికి మా ఫైట్ మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. అక్టోబర్ 10న మా ఎలక్షన్స్ జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు.. ఎవరి ప్లాన్ ఈసారి వర్క్ అవుట్ అవుతుంది అన్నది తెలియాల్సి ఉంది.