టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా గురువారం రవితేజ ఈడీ విచారణలో పాల్గొన్నారు. ఉదయం 10 గంటల కు విచారణకు హాజరైన రవితేజపై దాదాపు 5 గంటలకు పైగా ప్రశ్నించారని తెలుస్తుంది. మనీ ల్యాండరింగ్ కు సంబందిచిన విషయంలో కూడా రవితేజని ప్రశ్నించినట్టుగా సమాచారం. ఈడీ విచారణలో రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ కూడా కీలకంగా మారాడు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ముందు పట్టుబడిన వ్యక్తి శ్రీనివాస్. అతడిని విచారిస్తేనే కెల్విన్ పేరు బయటకు వచ్చింది. తీగ లాగితే డొక కదిలినట్టుగా వీరిద్దరి విచారణలో టాలీవుడ్ స్టార్ డ్రగ్స్ వినియోగం బయటపడింది. శ్రీనివాస్ ద్వారా సినిమా వాళ్లకు డ్రగ్స్ సరఫరా జరిగినత్టు అధికారులు గుర్తించారు.
ఈడీ విచారణలో భాగంగా పూరీ జగన్నాథ్, ఛార్మి, రానా, రకుల్ ఇప్పటికే విచారణలో పాల్గొన్నారు. గురువారం రవితేజ ఈడీ విచారణకు హాజరయ్యారు. రవితేజ ఖాతాలతో పాటు డ్రైవర్ శ్రీనివాస్ బ్యాంక్ ఎకౌంట్ల నుండ్డి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఇతర ఖాతాల్లోకి వెళ్లినట్తుగా గుర్తించారని తెలుస్తుంది.