మోహన్ బాబుకి కౌంటర్ ఇచ్చిన నాగబాబు..!

September 09, 2021


img

'మా' ఎలక్షన్స్ రగడ కొనసాగుతూనే ఉంది. ఎన్నికల్లో పోటీ చేసే వాళ్లు ఇప్పటికే ప్రెస్ మీట్ ల మీద ప్రెస్ మీట్ లు పెట్టి అరుచుకుంటున్నారు. కేవలం పోటీదారులే కాదు వారి సపోర్టర్స్ కూడా గొడవకి దారి తీసేలా కామెంట్స్ చేస్తున్నారు. 'మా' ఎలక్షన్స్ సందర్భంగా అప్పట్లో కొన్ని 'మా' బిల్డింగ్ వ్యవహారంలో మోహన్ బాబు స్పందిస్తూ అప్పట్లో కొన్న 'మా' బిల్డింగ్ ని ఎందుకు అమ్మేశారని ప్రశ్నించారు. అయితే దానికి రెస్పాన్స్ గా మెగా బ్రదర్ నాగ బాబు ఆన్సర్ ఇచ్చారు. 

'మా' కు ఒకప్పుడు సొంత ఆఫీస్ ఉండేది. శ్రీనగర్ కాలనీలో 90 లక్షలకు రెండు ఫ్లాటులు కొన్నారు. దానికోసం అన్ డివైడెడ్ షేర్ 145 గజాలు కూడా వచ్చింది. అయితే ఈ బిల్డింగ్ ను శివాజి రాజా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కేవలం 35 లక్షలకు మాత్రమే అమ్మేశారు. ఇప్పుడు ఆ బిల్డింగ్ కాస్ట్ కోటిన్నర దాకా ఉంటుందని అన్నారు నాగబాబు. మోహన్ బాబు నా పేరు ప్రస్థావించలేదు కాని ఆ ఆఫీస్ తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే కొన్నాం. ఆ తర్వాత పదేళ్లకు శివాజి రాజా అధ్యక్షుడిగా నరేష్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఏవో కారణాలు చెప్పి ఆ ఫ్లాట్ అమ్మేశారు. ఆ ఫ్లాట్ ను ఎందుకు అమ్మేశారో నరేష్ ను అడగండని.. నరేష్ ఇప్పుడు మీ ప్యానెల్ కు సపోర్ట్ చేస్తున్నారు కదా.. ఇక మీదట ఈ ప్రశ్న నన్ను అడిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని అన్నారు నాగబాబు. 

అంతేకాదు ప్రకాష్ రాజ్ పై నాన్ లోకల్ కార్డ్ ప్లే చేస్తున్న ప్రత్యర్ధుల గురించి మాట్లాడిన ఆయన. ఎంతకాలం సంకుచిత భావంతో బ్రతుకుతాం.. మనం ఆర్టిస్టులం.. ఏ భాష అయినా సరె.. కళాకారుడిని గౌరవిస్తాం.. తను ఏ భాషకు చెందినవాడో అనవసరం.. 'మా' కు మంచి చేస్తాడా.. లేదా అన్నదే ముఖ్యం అని మరోసారి ప్రకాష్ రాజ్ కు మద్ధతు ప్రకటించారు నాగబాబు.



Related Post

సినిమా స‌మీక్ష