బాలయ్యకు నో చెప్పిన టబు..!

June 18, 2021


img

నందమూరి బాలకృష్ణ అఖండ తర్వాత గోపీచంద్ మలినేని డైరక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యుయల్ రోల్ లో నటిస్తాడని టాక్. మిడిల్ ఏజ్ పాత్రకి జోడీగా సీనియర్ హీరోయిన్ ను తీసుకోవాలని చూస్తున్నారు. ఆ పాత్రకు టబుని అడిగితే ఆమె చేయనని చెప్పేసిందట. టబు ఆల్రెడీ బాలకృష్ణ నటించిన చెన్నకేశవ రెడ్డి సినిమాలో నటించింది. డేట్స్ అడ్జెస్ట్ కాలేదో లేక తెలుగు సినిమా చేసే ఉద్దేశం లేక కాదని చెప్పిందో కాని బాలకృష్ణ సినిమా ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందట టబు.

ప్రస్తుతం చిత్రయూనిట్ హీరోయిన్స్ వేటలో పడ్డది. ఆల్రెడీ ఈ సినిమాలో క్రాక్ జయమ్మ వరలక్ష్మి శరత్ కుమార్ ను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. సినిమాలో లేడీ విలన్ గా ఇంపార్టెంట్ రోల్ లో వరలక్ష్మి ని సెలెక్ట్ చేశారట. క్రాక్ సెంటిమెంట్ రిపీట్ చేస్తూ గోపీచంద్ వరలక్ష్మి పాత్రకు ప్రధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మరోసారి బాలయ్య మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా వస్తుందని అంటున్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష