రవితేజ హీరోగా నటిస్తున్న కిలాడి సినిమాను థియేటర్లలోనే విడుదల చేస్తామని నిర్మాత కోనేరు సత్యనారాయణ తెలిపారు. కిలాడి...ప్లే స్మార్ట్ (ట్యాగ్ లైన్) సినిమా మే 28న విడుదల కావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో లాక్డౌన్తో థియేటర్లన్నీ మూసేయడంతో ఈ సినిమాను ఓటీటీ ఫ్లాట్ ఫాంలో విడుదల అవుతుందని కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ తమ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు.
రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్లో కనిపించనున్నారు. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. కోనేరు సత్యనారాయణ, బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియో సంయుక్తంగా దీనిని నిర్మించాయి. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన కిలాడి ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉంది.