చావు కబురు చల్లగా ట్రైలర్.. మాస్ ఆడియెన్స్ కు పండుగే..!

March 05, 2021


img

ఆరెక్స్ 100 సినిమాతో యూత్ ఆడియెన్స్ ను అలరించిన కార్తికేయ వరుస సినిమాలతో అలరిస్తున్నాడు. ప్రస్తుతం కౌశిక్ డైరక్షన్ లో కార్తికేయ చేస్తున్న సినిమా చావు కబురు చల్లగా. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా మార్చ్ 19న రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. 

కార్తికేయ మాస్ లుక్ తో ఆకట్టుకోగా.. లావణ్య త్రిపాఠి డీ గ్లామరస్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ ఎంటర్టైనింగ్ గా ఉంది. చూస్తుంటే కార్తికేయకు ఈ సినిమా మంచి హిట్ ఇచ్చేలా ఉంది. లావణ్య త్రిపాఠి కూడా ఈ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ నుండి వస్తుంది కాబట్టి సినిమాపై ప్రేక్షకుల అంచనాలు అందుకునేలా ఉంటుందని అంటున్నారు. మరి కార్తికేయకు ఈ సినిమా అయిన హిట్ ఇస్తుందో లేదో చూడాలంటే రిలీజ్ రోజు వరకు వెయిట్ చేయాల్సిందే.





Related Post

సినిమా స‌మీక్ష