'వి' సినిమాపై పరువునష్టం దావా..!

March 04, 2021


img

నాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు కలిసి నటించిన క్రేజీ సినిమా వి. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో అదితి రావు హైదరి, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాలో పర్మిషన్ లేకుండా తన ఫోటో వాడినందుకు బాలీవుడ్ హీరోయిన్ సాక్షి మాలిక్ కోర్టుకు ఫిర్యాదు చేసింది. 

అయితే సాక్షి చేసిన ఫిర్యాదుకి కోర్ట్ వి సినిమా దర్శక నిర్మాతలకు వార్నింగ్ ఇచ్చింది. వ్యక్తి అనుమతి లేకుండా వారి ఫోటోలను సినిమాలో వాడటం పరువు నష్టం కిందకు వస్తుందని. వెంటనే ఆమె ఫోటోలు ఉన్న సన్నివేశాలు తొలగించాలని ఆర్డర్ ఇచ్చింది. వి సినిమాలో మొబైల్ ఫోన్ లో సెక్స్ వర్కర్ ఫోటోని చూపిస్తారు. ఆ ఫోటోలో ఉన్నది తనే అని గుర్తించిన సాక్షి మాలిక్ చిత్ర దర్శక నిర్మాతల మీద పరువు నష్టం దావా వేసింది. 

'వి' సినిమా డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అయ్యింది. అమేజాన్ ప్రైం లో ఈ సినిమా 2020 సెప్టెంబర్ 5న రిలీజైంది. థియేటర్లు తెరచుకున్న టైం లో 2021 జనవరి 1న రెండు రాష్ట్రాల్లో మళ్లీ థియేటర్ రిలీజ్ కూడా నాని 'వి' మూవీ రిలీజైంది. అయితే OTTలోనే యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా థియేటర్ రిలీజైనా పెద్దగా ఆడలేదు. 



Related Post

సినిమా స‌మీక్ష