ఉప్పెన జోడీ డబుల్ ధమాకా..!

February 26, 2021


img

వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా బుచ్చి బాబు డైరక్షన్ లో వచ్చిన సినిమా ఉప్పెన. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ కూడా సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది. ఫిబ్రవరి 12న రిలీజై సెన్సేషనల్ హిట్టైన ఈ సినిమా వసూళ్లతో లాభాలు తెచ్చింది. అయితే ఈ సినిమా భారీ లాభాలు తీసుకురావడంతో నిర్మాతలు హీరో, హీరోయిన్ కు కొంత రెమ్యునరేషన్ అదనంగా ఇచ్చారట.

సినిమా రిలీజ్ కు ముందే మాట్లాడుకున్న రెమ్యునరేషన్ ఇచ్చేశారట. ఇక ఇప్పుడు గిఫ్ట్ లా వైష్ణవ్ తేజ్ కు కోటి, కృతి శెట్టికి 25 లక్షలు ఇచ్చారట. సో ఒక సినిమా చేసి ఈ హీరో, హీరోయిన్ రెండు సినిమాల పేమెంట్స్ పొందారని చెప్పొచ్చు. ఉప్పెన జోడీ డబుల్ ధమాకా అందుకుందని అందరు అంటున్నారు. వైష్ణవ్ తేజ్ తన సెకండ్ సినిమా క్రిష్ డైరక్షన్ లో చేశాడు. కృతి శెట్టి కూడా నాని, సుధీర్ బాబు సినిమాల్లో నటిస్తుంది. 



Related Post

సినిమా స‌మీక్ష