పొరుగు దేశం నేపాల్ రాజధాని ఖాట్మండులో ఈరోజు ఉదయం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఖాట్మండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శౌర్య ఎయిర్ లైన్స్కు చెందిన విమానం ఈరోజు ఉదయం 11 గంటలకు పోఖరాకు బయలుదేరింది. కానీ టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే రన్ వేపైనే కూలిపోయింది.
విమానంలో సిబ్బందితో కలిపి మొత్తం 19 మంది ఉన్నారు. వారిలో 18 మంది చనిపోగా పైలట్ కెప్టెన్ మనీష్ శాక్య ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. విమానాశ్రయం సమీపంలోనే విమానం కూలిపోవడంతో వెంటనే సహాయ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకొని మంటలు ఆర్పేశారు. కానీ పైలట్ తప్ప విమానంలో ఉన్నవారందరూ చనిపోయారు. సహాయ సిబ్బంది 5 మృతదేహాలను వెలికి తీశారు. విమాన ప్రమాదానికి కారణం ఇంకా తెలియవలసి ఉంది.