దక్షిణకాశీగా పేరొందిన నిజామాబాద్ జిల్లాలోని శ్రీ నీలకంటేశ్వరస్వామివారి ఆలయంలో అపచారం జరిగింది. ఆలయ అర్చకులు ఉత్సవమూర్తులకు పుష్కరిణిలో అభిషేకం చేస్తుండగా, ఆలయ ఈవో వేణు పుష్కరిణిలో దిగి జలకాలు ఆడారు. స్వామివారికి అభిషేకం జరుగుతున్నప్పుడు సాధారణ భక్తులు కూడా పుష్కరిణిలో దిగడం అపచారంగా భావిస్తారు. కానీ ఆలయ ఈవో వేణు హాయిగా జలకాలు ఆడారు. ఆలయ అర్చకులు వారిస్తున్నప్పటికీ ఈవో వారి మాటలను పట్టించుకోకుండా కాసేపు పుష్కరిణిలో ఈతకొట్టారు.
అక్కడే ఉన్న భక్తులు ఇదంతా తమ మొబైల్ ఫోన్లలో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది. ఆలయ ఈవోని తక్షణమే సస్పెండ్ చేయాలని భక్తులు కోరుతున్నారు. ఇప్పటికే పలు కారణాల వలన హిందూ సంస్కృతి అనేక ఆటుపోట్లు ఎదుర్కోవలసి వస్తోంది. కనీసం దేవాలయాలలోనైనా హిందూధర్మం గౌరవించబడుతుందనుకొంటే, ఆలయ ఈవో స్థాయిలో ఉన్నవారే ఈవిదంగా వ్యవహరించడం చాలా దారుణం. ఆలయ మర్యాదలను పాటించనివారికి ఆలయాలలో ఉద్యోగాలు కల్పిస్తుండటం వలన ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పవచ్చు.
Video Courtecy: RTV