నరేష్, పవిత్రా లోకేష్ ఈ ఏడాది కొత్త జీవితం ప్రారంభించాలనుకొంటున్నామంటూ సోషల్ మీడియాలో లిప్-లాక్ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి నిజంగానే వారి జీవితంలో వారు ఊహించని కొత్త మలుపు వచ్చిపడింది.
తన భార్య రమ్య రఘుపతి, ఆమె బందువు, సీనియర్ కాంగ్రెస్ నేత రఘువీరరెడ్డి సాయంతో తనని హత్య చేయించేందుకు ప్రయత్నిస్తోందంటూ నరేష్ కోర్టులో పిటిషన్ వేశారు. కర్ణాటకకి చెందిన రాకేష్ శెట్టి అనే వ్యక్తికి తనని హత్య చేసేందుకు సుపారీ ఇచ్చారని నరేష్ ఆరోపించారు. తన తండ్రి కృష్ణ చనిపోయినప్పుడే ఆ వ్యక్తి తన ఇంటి ముందు రెక్కీ నిర్వహించాడని నరేష్ పిటిషన్లో పేర్కొన్నారు. ఓ పోలీస్ ఆఫీసర్ సాయంతో రమ్య రఘుపతి తన ఫోన్ని హ్యాక్ చేయించిందని నరేష్ ఆరోపించారు. కాంగ్రెస్ నేత రఘువీరరెడ్డితో సహా కొందరు తనకు ఫోన్లు చేసి రమ్యతో రూ.10 కోట్లకి సెటిల్మెంట్ చేసుకోవాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు.
తన భార్య రమ్యరఘుపతి, మరికొందరి వలన తనకి ప్రాణహాని ఉందని నరేష్ తన పిటిషన్లో కోర్టుకి తెలియజేసి, ఈ కుట్రలపై పోలీసులతో దర్యాప్తు జరిపించి దోషులని శిక్షించి వారి నుంచి తనకు రక్షణ కల్పించాల్సిందిగా నరేష్ తన పిటిషన్లో న్యాయస్థానాన్ని కోరారు.