ప్రముఖ నటుడు శర్వానంద్, రక్షిత రెడ్డిల వివాహ నిశ్చితార్ధ కార్యక్రమం గురువారం హైదరాబాద్లో ఓ ప్రముఖ హోటల్లో జరిగింది. ఇరుకుటుంబాలు, సమీప బంధుమిత్రుల సమక్షంలో చాలా నిరాడంబరంగా ఈ కార్యక్రమం జరిగింది. శర్వానంద్ మిత్రుడు, ప్రముఖ నటుడు రామ్ చరణ్ దంపతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యి కాబోయే వధూవరులకి అభినందనలు తెలిపారు.
రక్షిత రెడ్డి ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మనుమరాలు, తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె. అమెరికాలో ఓ ఐటి కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్న రక్షిత రెడ్డి స్వదేశానికి తిరిగివచ్చి హైదరాబాద్లో ఇంటి నుంచే పనిచేస్తున్నట్లు సమాచారం.