హైదరాబాద్‌లో శర్వానంద్ రక్షిత రెడ్డి వివాహ నిశ్చితార్ధం

January 26, 2023
img

ప్రముఖ నటుడు శర్వానంద్, రక్షిత రెడ్డిల వివాహ నిశ్చితార్ధ కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో ఓ ప్రముఖ హోటల్‌లో జరిగింది. ఇరుకుటుంబాలు, సమీప బంధుమిత్రుల సమక్షంలో  చాలా నిరాడంబరంగా ఈ కార్యక్రమం జరిగింది. శర్వానంద్ మిత్రుడు, ప్రముఖ నటుడు రామ్ చరణ్‌ దంపతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యి కాబోయే వధూవరులకి అభినందనలు తెలిపారు. 

రక్షిత రెడ్డి ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మనుమరాలు, తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె. అమెరికాలో ఓ ఐ‌టి కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్న రక్షిత రెడ్డి స్వదేశానికి తిరిగివచ్చి హైదరాబాద్‌లో ఇంటి నుంచే పనిచేస్తున్నట్లు సమాచారం.


Related Post