కరోనా నివారణకు ‘కోవాక్సిన్’ పేరుతో దేశీయంగా వాక్సిన్లు తయారుచేసి అందజేసిన భారత్ బయోటెక్ కంపెనీ పేరు గత రెండేళ్ళలో దేశమంతటా మారుమ్రోగిపోయింది. ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా భారత్ బయోటెక్ కంపెనీలో తయారవుతున్న వాక్సిన్లను చూసేందుకు హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సంస్థ ఉడతా భక్తిగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రులవారికి కోటి రూపాయలు కానుకగా సమర్పించుకొంది. ఈ సొమ్మును ఆలయంలో నిత్యాన్నధానం కొరకు వినియోగించాలని ఆలయ ఈవోను కోరి ఆలయ బ్యాంక్ ఖాతాలో ఆ సొమ్మును జమా చేసింది.