ఏపీలో తుఫాను కారణంగా రాయలసీమలో నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలలో అనేక ఇళ్ళు కూలిపోయాయి. దీంతో అనేకమంది నిరాశ్రయులయ్యారు. లక్షలాది ఎకరాలలో పంటలు నీట మునిగాయి. ఏపీలో వరద బాధితులను ఆడుకోవడానికి తెలుగు సినీ పరిశ్రమలో పలువురు ప్రముఖులు భారీగా విరాళాలు ఇస్తుయారు. వారిలో చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్ ఒక్కొక్కరూ రూ.25 లక్షల చొప్పున ఏపీ సిఎం సహాయ నిధికి విరాళాలు అందజేశారు. ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ రూ.10 లక్షలు విరాళం ఇచ్చారు.