యాదాద్రి ఆలయ గోపురానికి బంగారంతో తాపడం చేయించడానికి అందరూ విరాళాలు ఇవ్వాలని సిఎం కేసీఆర్ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. సిఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలువురు పారిశ్రామికవేత్తలు తదితరులు కలిపి మొత్తం 28 కేజీల బంగారం విరాళంగా ప్రకటించారు. ఈ దైవకార్యం కోసం సామాన్య ప్రజలు మొదలు పలువురు ప్రముఖులు విరాళాలు అందజేసేందుకు ముందుకు వస్తున్నారు. అటువంటి వారి కోసం యాదాద్రి ఆలయంలో ప్రత్యేకంగా హుండీలు ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాలలో ఉన్నవారి కోసం యాదాద్రి ఆలయ అధికారులు ప్రత్యేకంగా ఓ బ్యాంక్ అకౌంట్ తెరిచారు. అకౌంట్ తెరిచిన రెండు రోజులలోనే రూ. 27 లక్షలు విరాళాలు అందాయని అధికారులు తెలిపారు. ఈ బంగారు తాపడం కోసం విరాళాల సేకరణ కోసం ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు అధికారులు తెలిపారు.
దూర ప్రాంతాలలో ఉన్నవారు ఈ దిగువన పేర్కొన్న బ్యాంక్ ఖాతాకు ఆన్లైన్లో విరాళాలు పంపించవచ్చు.
ఇండియన్ బ్యాంక్, యాదగిరిగుట్ట బ్రాంచ్,
అకౌంట్ నెంబర్: 6814884695
ఐఎఫ్ఎస్సీ నెంబర్: IDBI000YO11