మధ్యాహ్నం మూడు వరకే వాహనాలకు అనుమతి

September 25, 2021
img

ప్రతీ ఆదివారం సాయంత్రం 5 నుంచి రాత్రి 10 వరకు ట్యాంక్‌ బండ్‌పై వాహనాల రాకపోకలను నిషేదించడంతో నగరవాసులు, పర్యాటకులు హాయిగా గడిపి వెళుతున్నారు. ఈ నిర్ణయానికి మంచి ప్రజాధారణ లభిస్తుండటంతో రేపు (ఆదివారం) నుంచి మరో రెండు గంటలు ముందుగానే అంటే మధ్యాహ్నం 3 గంటల నుంచే ట్యాంక్‌ బండ్‌పై వాహనాల రాకపోకలు నిషేదించాలని నగర పోలీస్ కమీషనర్‌ అంజనీ కుమార్‌ నిర్ణయించారు. కనుక సందర్శకులకు ట్యాంక్‌ బండ్‌పై మరింత ఎక్కువ సమయం గడిపేందుకు అవకాశం లభిస్తుంది. మంత్రి కేటీఆర్‌ ఆదేశం మేరకు జీహెచ్‌ఎంసీ ట్యాంక్‌ బండ్‌ సందర్శకులను అలరించేందుకు లేజర్ షో, సాంస్కృతిక, హస్త కళా ప్రదర్శనలు కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 


Related Post