రాజు ఆచూకీ తెలిపితే 10 లక్షలు బహుమానం

September 15, 2021
img

సైదాబాద్‌లో సింగరేణి కాలనీలో ఆరేళ్ళ బాలికను అత్యాచారం చేసి గొంతు నులిమి హత్య చేసి పారిపోయిన పాలకొండ రాజును పట్టుకొనేందుకు పోలీసు బృందాలు ఇంకా గాలిస్తూనే ఉన్నాయి. కానీ ఇంతవరకు అతని ఆచూకీ కనుగొనలేకపోయారు. దీంతో హైదరాబాద్‌ పోలీస్ కమీషనర్‌ అంజనీకుమార్ రాజు ఆచూకీ తెలిపినవారికి రూ.10 లక్షలు ఆగదు బహుమానం ఇస్తామని ప్రకటించారు. రాజు ఆచూకీ తెలిపినవారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ప్రకటనలో హామీ ఇచ్చారు.   

నిందితుడు ఫోటోతో పాటు అతని వివరాలను కమీషనర్‌ అంజనీ కుమార్‌ మీడియాకు విడుదల చేశారు.   


Related Post