ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే సంవత్సరం నుంచి మట్టి గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించి, మండపంలోనే నిమజ్జనం చేపట్టాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. మరోవైపు హైకోర్టు హుస్సేన్సాగర్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పిఓపి)తో తయారుచేసిన గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేయరాదని తీర్పును వెలువరించడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.