ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రపంచానికి యోగా పరిచయం చేసిన దేశంగా భారత్ నిలిచింది. 2014లో భారత ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో యోగా ప్రాముఖ్యతను తెలిపారు. దీంతో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ్యులు ఏకకంఠంతో జూన్ 21 తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించారు. 2015 సంవత్సరం నుంచి ప్రతీ ఏటా జూన్ 21న తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటాము.