భాజపా రాష్ట్ర సీనియర్ నేత, ఓబీసీ జాతీయ అధ్యక్షుడు కే. లక్ష్మణ్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. లక్ష్మణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా...లక్ష్మణ్ తనను కలిసిన వారందరూ కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.