హైదరాబాద్ నగరంలోని మల్లాపూర్కు చెందిన పావని అనే నిండు గర్భిణీ స్త్రీకి నిన్న ఉదయం ఆరోగ్యం విషమించినప్పుడు ఏ ఆసుపత్రులు చేర్చుకోకపోవడంతో ఆమె అంబులెన్సులోనే మరణించడం, ఆ తరువాత తల్లి కడుపులో నుంచి బిడ్డను బయటకు తీస్తేగానీ దహనం చేయమని శ్మశానవాటిక నిర్వాహకులు చెప్పడం, దాంతో తల్లితండ్రులు కూతురు మృతదేహాన్ని అంబులెన్సులో పెట్టుకొని మళ్ళీ ఆసుపత్రుల చుట్టూ తిరగడం మేడ్చల్ జిల్లా ఇన్-ఛార్జ్ కలెక్టర్ శ్వేతా మొహంతి దృష్టికి రావడంతో ఆమె వెంటనే వివారణకు ఆదేశించి, జిల్లా వైద్యాధికారి మల్లిఖార్జున్ను పావని తల్లితండ్రుల వద్దకు పంపించారు. ఆయన ఈ విషాద ఘటనలకు సంబందించి పూర్తి నివేదిక తయారు చేసి శ్వేతా మొహంతికి అందజేసి పరిస్థితి వివరించారు. ఆమె వెంటనే అధికారులను పంపించి మల్లాపూర్ శ్మశానవాటిక నిర్వాహకులతో మాట్లాడించి పావని అంత్యక్రియలు చేయించారు.