ఏపీలో రోజురోజుకీ కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతుండటంతో ఇప్పటికే రాత్రిపూట కర్ఫ్యూ అమలులో ఉంది. బుదవారం నుంచి రెండువారాల పాటు పగలు కూడా పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కనుక ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అన్ని దుకాణాలు, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ వగైరాలు పనిచేస్తాయి. మళ్ళీ మర్నాడు ఉదయం 6 గంటల వరకు అంటే రోజుకి 18 గంటల చొప్పున రాష్ట్రమంతటా రెండు వారాలపాటు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కనుక తెలంగాణ నుంచి ఏపీకి వెళ్ళేవారు ఈ కర్ఫ్యూ సమయాలను గుర్తుంచుకొని తదనుగుణంగా బయలుదేరడం మంచిది.