మహిళా దినోత్సవంనాడు చెత్తకుండీలో ఆడశిశువు!

March 08, 2021
img

నేడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో మహిళ దినోత్సవం వేడుకలు జరుపుకొంటున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, మహిళాభ్యుదయం గురించి గంభీరమైన ప్రసంగాలు మారుమ్రోగుతున్నాయి. సరిగ్గా ఈరోజునే మహబూబాబాద్ జిల్లాలో అప్పుడే పుట్టిన పసికందును ఓ కసాయి తల్లితండ్రులు గోనె సంచీలో చుట్టి చెత్తకుండీలో పడేసి వెళ్ళిపోయారు. జిల్లాలోని డోర్నకల్ మండలం, బూర్గుంపాడులో ఈ హృదయవిదారకమైన దారుణం జరిగింది. అటుగా వెళుతున్న కొందరు కూలీలు చెత్తకుండీలో నుంచి శిశువు ఏడుపు వినిపించడంతో వెళ్ళి చూడగా వారికి గోనెసంచీలో చుట్టిన ఆడశిశువు కనిపించింది. పుట్టింది ఆడపిల్ల కనుకనే తల్లితండ్రులు ఆ శిశువును నిర్ధయగా చెత్తకుండీలో పడేసి వెళ్ళిపోయి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకొన్న పోలీసులు శిశువును ఏరియా ఆసుపత్రిలో చేర్చి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


Related Post