శశికళ సంచలన నిర్ణయం

March 04, 2021
img

తమిళనాడు రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న శశికళ హటాత్తుగా బుదవారం రాత్రి తాను రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బుదవారం రాత్రి ఓ లేఖను విడుదల చేశారు. దానిలో ఆమె ఏమి వ్రాశారంటే... “జయలలిత జీవించి ఉన్నప్పుడు కూడా నేను ఏనాడూ పదవులు, అధికారం కోసం ఆరాటపడలేదు. ఆమె మరణించిన తరువాత కూడా నేను వాటి కోసం ఆరాటపడటం లేదు. అది నిరూపించుకొనేందుకే రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకొన్నాను. అన్నాడీఎంకె పార్టీ జయలలిత ఆశయాలకు అనుగుణంగా పరిపాలన చేయాలని కోరుకొంటున్నాను. త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ గెలవాలని కోరుకొంటున్నాను. అందుకోసం పార్టీలో నేతలు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి మన ప్రధానశత్రువైన డీఎంకె పార్టీని ఎదుర్కొని ఓడించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

Related Post