నేడు సిఎం కేసీఆర్ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకొని, ఆలయ నిర్మాణపనులను పరిశీలించబోతున్నారు. ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 11 గంటలకు యాదాద్రి చేరుకొంటారు. బాలాలయంలో స్వామివారిని దర్శించుకొన్న తరువాత ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు ఇస్తారు. ఆలయ నిర్మాణపనులు దాదాపు పూర్తికావచ్చినందున ఆలయం పునఃప్రారంభం గురించి అధికారులతో చర్చిస్తారు. అనంతరం శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామితో కూడా చర్చించి ముహూర్తం ఖరారు చేస్తారు.
సిఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా హైదరాబాద్ నుంచి యాదాద్రికి వెళ్ళే రోడ్డు మార్గంలో ఎక్కడికక్కడ పోలీసులను మోహరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గుట్టపై కూడా భారీగా పోలీసులను మోహరించారు.