ఓ పక్క జమ్ము కశ్మీర్ ఉగ్రదాడిపై కేంద్ర ప్రభుత్వం, దేశ ప్రజలు తీవ్రంగా స్పందిస్తుండగా, మరోపక్క ఉగ్రవాదులు మాజీ క్రికెటర్, టీమిండియా కోచ్ గౌతం గంభీర్కి ఉగ్రవాదులు బెదిరిస్తూ ఈ మెయిల్స్ పంపిస్తుండటం దిగ్బ్రాంతి కలిగిస్తుంది.
గౌతం గంభీర్ని, ఆయన కుటుంబాన్ని కూడా చంపేస్తామని, ఆయన ఇంటిని బాంబులతో పేల్చివేస్తామంటూ ఉగ్రవాదులు హెచ్చరించారు. వెంటనే ఆయన ఢిల్లీ పోలీసులకు పిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకొని ఆయనకు వచ్చిన బెదిరంపు ఈమెయిల్స్ వివరాలు తీసుకొని అవి ఎక్కడి నుంచి ఎవరు పంపించారో కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉగ్రవాదుల బెదిరంపుల నేపధ్యంలో గౌతం గంభీర్కు భద్రత పెంచారు. ఢిల్లీలోని ఆయన నివాసం వద్ద తనికీలు చేసి భద్రత పెంచారు.
టీమిండియా ప్లేయర్లలో గౌతం గంభీర్ ఒక్కరే తరచూ పాకిస్థాన్ పాలకులను, ఉగ్రవాదులని విమర్శిస్తుంటారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుంటారు. అందుకే ఈ బెదిరింపులు.