హుజూరాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై వరంగల్ సుబేదారీ పోలీస్ స్టేషన్లో నాన్-బెయిలబుల్ కేసు నమోదు అయ్యింది. కమలాపురం మండలంలో వంగపల్లి గ్రామ శివారులో గల ఓ క్రషర్ ఉంది. హనుమకొండకు చెందిన దాని యజమాని కట్టా మనోజ్ బెదిరించి రూ.25 లక్షలు వసూలు చేసుకున్నారు.
ఆ క్రషర్ తన నియోజకవర్గం పరిధిలో ఉంది కనుక తాను అడిగినంతా సొమ్ము చెల్లించాల్సిందే అని పాడి కౌశిక్ రెడ్డి క్రషర్ యజమానిని బెదిరించారని, మరో రూ.50 లక్షలు ఇవ్వాలని లేకుంటే కుటుంబ సభ్యులతో సహా అందరినీ చంపేస్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన భర్తని బెదిరిస్తున్నారని ఆయన భార్య కట్టా ఉమాదేవి పోలీసులకు పిర్యాదు చేశారు.
ఆమె ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫోన్ కాల్ రికార్డింగులని పోలీసులకు సమర్పించడంతో వారు పలు సెక్షన్స్ కింద ఆయనపై కేసు నమోదు చేశారు. ఆ కేసులో ఆయన కోర్టుకు వెళ్ళినా బెయిల్ లభించే అవకాశం ఉండదు కనుక త్వరలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది.