ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్ అంజనీ కుమార్‌ ఏపీకి బదిలీ

October 11, 2024


img

రాష్ట్ర విభజన సమయంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా విభజించి రెండు రాష్ట్రాలకు కేటాయించారు. కానీ ఏపీకి కేటాయించబడిన కొందరు అధికారులు ట్రిబ్యూనల్‌ని ఆశ్రయించి నేటికీ తెలంగాణ ప్రభుత్వంలోనే పనిచేస్తున్నారు.

వారందరూ ఈ నెల 16లోగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం(డివోపిటి) ఆదేశించింది. వారిలో ఐదుగురు ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్ అధికారులున్నారు. 

ఐఏఎస్ అధికారులు: ఆమ్రపాలి (జీహెచ్‌ఎంసీ మునిసిపల్ కమీషనర్‌గా); రోనాల్డ్ రాస్ (తెలంగాణ ఇంధన శాఖ కార్యదర్శి, ట్రాన్స్‌కో సీఎండీ); వాణీ ప్రసాద్ (యువజన, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి); వాకాటి కరుణ (మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి); ప్రశాంతి (పర్యావరణం, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి).  

ఐపీఎస్ అధికారులు: అంజనీ కుమార్‌ (ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమీషనర్‌); అభిషేక్ మహంతి (కరీంనగర్‌ పోలీస్ కమీషనర్‌గా); అభిలాష్ బిస్త్ (పోలీస్ అకాడమీ డీజీ). 

వీరి అభ్యర్దనలను పునః పరిశీలించాలని హైకోర్టు ఆదేశం మేరకు కేంద్ర ప్రభుత్వం దీపక్ ఖండేఖర్ కమిటీని నియమించింది. కానీ అది కూడా ఆంధ్రా క్యాడర్‌కి చెందిన వారందరినీ ఆంధ్రాకి పంపించాలని సిఫార్సు చేయడంతో డివోపిటి ఈ 8 మందిని తక్షణం తెలంగాణ ప్రభుత్వం నుంచి రిలీవ్ అయ్యి ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. 

అదేవిదంగా ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ క్యాడర్‌కు చెందిన ముగ్గురు ఐఏఎస్ అధికారులు  హరికిరణ్, సృజన, శివశంకర్‌లను ఈ నెల 16లోగా తెలంగాణ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.        



Related Post