కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడవసారి బడ్జెట్ ప్రవేశపెట్టి సరికొత్త రికార్డ్ సృష్టించారు. ఆమె మంగళవారం లోక్సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఎప్పటిలాగే కొన్ని వస్తువులపై పన్ను తగ్గించారు. మరికొన్నిటిపై పెంచారు. ఆ ప్రభావంతో కొన్ని వస్తువుల ధరలు తగ్గబోతున్నాయి. మరికొన్ని పెరుగబోతున్నాయి.
భారతీయులకు అత్యంత ఇష్టమైన బంగారు, వెండి ఆభరణాలపై 5 శాతం, ప్లాటినం ఆభరణాలపై 6.5 శాతం పన్ను పన్ను తగ్గించడంతో వాటి ధరలు తగ్గుతాయి. అలాగే మొబైల్ ఫోన్లలో ఉండే ప్రింటడ్ సర్క్యూట్ బోర్డులపై. మొబైల్ చార్జర్లు, లెదర్ ప్రొడక్ట్స్, చేపలు, రొయ్యల మేతపై 5 శాతం పన్ను తగ్గించడంతో సీఫుడ్ ధరలు తగ్గుతాయి.
క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మూడు ప్రధాన ఔషదాలపై 6 శాతం పన్ను తగ్గించడంతో ఆ మేరకు ఆ మూడు మందుల ధరలు తగ్గబోతున్నాయి.
అమ్మోనియం నైట్రేట్, పర్యావరణానికి నష్టం కలిగించే ప్లాస్టిక్పై 10 శాతం పన్ను పెంచడంతో ప్లాస్టిక్ ఉత్పత్తుల ధరలు ఆ మేరకు పెరుగనున్నాయి.
టెలికాం పరికరాలలో వినియోగించే మదర్ బోర్డుల దిగుమ్తి సుంకం 5 శాతం పెంచినందున ఆ మేరకు వాటి ధరలు పెరుగనున్నాయి.