కొడంగల్‌లో బిఆర్ఎస్‌ పార్టీకి షాక్.. గురునాద్ రెడ్డి జంప్?

January 27, 2023


img

కొడంగల్‌లో బిఆర్ఎస్‌ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ ఎమ్మెల్యే గురునాద్ రెడ్డితో పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యి కాంగ్రెస్ పార్టీలో చేరవలసిందిగా ఆహ్వానించారు. కొడంగల్‌ బిఆర్ఎస్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో ఆయనకి విభేధాలున్నందున గత కొంతకాలంగా బిఆర్ఎస్‌ పార్టీకి దూరంగా ఉంటున్నారు. రేవంత్‌ రెడ్డి స్వయంగా వచ్చి ఆహ్వానించడంతో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. గురునాద్ రెడ్డితో పాటు కొడంగల్‌ మున్సిపల్ ఛైర్మన్‌ జగదీశ్వర్ రెడ్డి, ఎంపీపీ మూదప్ప కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. గత శాసనసభ ఎన్నికలలో కొడంగల్‌లో రేవంత్‌ రెడ్డి ఓటమికి, పట్నం నరేందర్ రెడ్డి గెలుపుకి వీరు ముగ్గురే కారణం. ఇప్పుడు రేవంత్‌ రెడ్డే వారిని స్వయంగా కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించడం, పట్నం నరేందర్ రెడ్డి కారణంగానే వారు ముగ్గురూ కాంగ్రెస్ పార్టీలో చేరడం విశేషమే కదా?



Related Post