ఈ నెల 31వ తేదీ నుంచి ఏప్రిల్ 6 వరకు పార్లమెంట్ తొలి విడత బడ్జెట్ సమావేశాలు జరుగబోతున్నందున ఈ ఆదివారం ప్రగతి భవన్లో సిఎం కేసీఆర్ అధ్యక్షతన బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో బిఆర్ఎస్ ఎంపీలో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై సిఎం కేసీఆర్ ఎంపీలకి మార్గదర్శనం చేయనున్నారు.
కేసీఆర్ బిఆర్ఎస్తో జాతీయ రాజకీయాలలో ప్రవేశించే ముందు దేశంలో కొన్ని పార్టీల అధినేతలు, ముఖ్యమంత్రులతో ఇప్పటికే పలుమార్లు సమావేశమైయ్యారు కనుక పార్లమెంటు సమావేశాలలో ఆయా పార్టీల సభ్యులతో కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే ప్రయత్నం చేయవచ్చు. కనుక ఈసారి తెలంగాణకి సంబందించిన అంశాలతో పాటు వివిద రాష్ట్రాల అంశాలపై కూడా బిఐఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు.