తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ బదిలీ అయ్యారు. ఆయనను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించి, ఆయన స్థానంలో తెలంగాణ హైకోర్టులో జడ్జిగా పనిచేస్తున్న ఉజ్జల్ భుయాన్ను నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియమ్ ఉత్తర్వులు జారీ చేసింది.
జస్టిస్ భూయాన్ 2011 నుంచి 2017వరకు గౌహతీ హైకోర్టు అధనపు జడ్జీగా పనిచేశారు. తరువాత 2019లో బొంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. అక్కడ రెండేళ్ళు పనిచేసిన తరువాత తెలంగాణ హైకోర్టుకి బదిలీ అయ్యి ప్రస్తుతం జడ్జీగా చేస్తున్నారు. సీనియారిటీ, అనుభవం ప్రకారం జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఈ పదోన్నతితో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.