యాదాద్రిలో తాత్కాలికంగా అన్నదాన కార్యక్రమం నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. పాత కనుమ దారి విస్తరణ పనులు చేపట్టినందున భక్తులకు ఇబ్బందికరంగా ఉంటుంది కనుక నేటి నుంచి 10 రోజుల పాటు అన్నదానం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. నిర్మాణ పనులు పూర్తికాగానే మళ్ళీ యధావిధిగా అన్నదాన కార్యక్రమం కొనసాగుతుందని ఈవో గీత తెలిపారు.