తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్‌ మాజీ సభ్యుడు బిజెపిలోకి

December 01, 2021


img

తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్‌ మాజీ సభ్యుడు, మాజీ టీఎన్జీవో నేత చింతల్ గట్టు విటల్ త్వరలో బిజెపిలో చేరబోతున్నారు. ఈ విషయం రాష్ట్ర బిజెపి నేతలు స్వయంగా తెలిపారు. ప్రస్తుతం ఆయనతో చర్చలు జరుపుతున్నామని త్వరలోనే బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన బిజెపిలో చేరుతారని ఆ పార్టీ నేతలు తెలిపారు. 

సిద్ధిపేట జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన వెంకట్ రామిరెడ్డి తన పదవికి రాజీనామా చేసి టిఆర్ఎస్‌ పార్టీలో చేరి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికవగా, అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వంలో ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ఆర్‌ఎస్. ప్రవీణ్ కుమార్‌ తన పదవికి రాజీనామా చేసి బీఎస్పీలో చేరిన సంగతి తెలిసిందే. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాజకీయాలలోకి రావడం కొత్త కాదు కానీ ఈమద్యన రాష్ట్రంలో వారు కూడా రాజకీయాలపై ఆసక్తి పెంచుకొని రాజకీయాలలోకి ప్రవేశిస్తుండటం విశేషం.      



Related Post