ప్రధాని నరేంద్రమోడీ జాతినుద్దేశ్యించి ప్రసంగం

October 22, 2021


img

ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసార మాద్యమాల ద్వారా దేశ ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగించనున్నారు. భారత్‌ 100 కోట్ల వాక్సినేషన్ మైలురాయిని అధిగమించిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ నేడు దేశ ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, కరోనా మహమ్మారి కోరల నుంచి దేశం ఏవిదంగా బయటపడింది? అందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య ఆరోగ్య, మున్సిపల్ శాఖలు, వైద్యులు, వైద్య సిబ్బంది ఎంతగా కష్టపడిందీ ప్రజలకు వివరించబోతున్నారు. నేటికీ కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోలేదు కనుక ఇకపై కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నాయో వివరించి దేశ ప్రజలందరూ కరోనా టీకాలు వేసుకొని, కరోనా జాగ్రత్తలు పాటించాలని కోరనున్నారు.            



Related Post