ఢిల్లీలోని రోహిణీ కోర్టు రూమ్ 207లో న్యాయమూర్తి ఎదుటే స్థానిక సునీల్ గ్యాంగ్ తుపాకులతో తమ ప్రత్యర్ధిపై విచాక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పులలో గ్యాంగ్ స్టార్ జితేంద్రతోపాటు సునీల్ గ్యాంగ్ను అడ్డుకొనే ప్రయత్నంలో ముగ్గురు పోలీసులు కూడా మృతి చెందారు.
ఢిల్లీ పోలీసుల సమాచారం ప్రకారం...ఈరోజు గ్యాంగ్ స్టర్ జితేంద్ర మాన్ గోగిని కోర్టులో విచారణకు హాజరవుతున్నాడనే విషయం తెలుసుకొన్న అతని ప్రత్యర్ధి సునీల్ గ్యాంగ్ ఈ దారుణానికి పాల్పడ్డారు. వారు లాయర్ దుస్తులు ధరించి రావడంతో ఎవరికీ అనుమానం రాలేదు. వారు కోర్టు హాలులోకి ప్రవేశించి తమ ప్రత్యర్ధిని తుపాకీతో కాల్చి చంపారు. అయితే జితేంద్ర గ్యాంగ్ కూడా వెంటనే తుపాకులు తీసి సునీల్ గ్యాంగ్పై కాల్పులు జరుపడంతో కోర్టు రూమ్ తుపాకుల మోతతో దద్దరిలిపోయింది. ఇరు వర్గాలు హటాత్తుగా తుపాకులు బయటకు తీసి పరస్పరం కాల్పులు జరుపడంతో న్యాయమూర్తితో సహా అందరూ భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ హడావుడిలోనే సునీల్ గ్యాంగ్ తప్పించుకొని పారిపోయింది. సుమారు 30-40 రౌండ్లు కాల్చినట్లు పోలీసులు నిర్ధారించారు.
#WATCH | Visuals of the shootout at Delhi's Rohini court today
As per Delhi Police, assailants opened fire at gangster Jitender Mann 'Gogi', who has died. Three attackers have also been shot dead by police. pic.twitter.com/dYgRjQGW7J