సైదాబాద్ సింగరేణి కాలనీలో అత్యాచారం, హత్య ఘటనపై సిఎం కేసీఆర్ స్పందించనందుకు నిరసనగా వైఎస్సార్టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిన్న ఉదయం నుంచి బాధిత కుటుంబం ఇంటివద్ద దీక్షకు కూర్చొన్నారు. ఈ ఘటనపై సిఎం కేసీఆర్ స్పందించేవరకు దీక్ష కొనసాగిస్తానని వైఎస్ షర్మిల తెలిపారు. అయితే అర్ధరాత్రి పోలీసులు వచ్చి ఆమె దీక్షను భగ్నం చేశారు. ఈ సందర్భంగా ఆమె అనుచరులు పోలీసులను అడ్డుకొనేందుకు ప్రయత్నించడంతో వారిని చెదరగొట్టి వైఎస్ షర్మిలను బలవంతంగా కారులో ఎక్కించి ఆమె ఇంటికి తరలించారు.